Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!
on Jan 6, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.
వాళ్ళకి కూడా గంగ కరెక్ట్ గానే సమాధానం చెప్తుంది. మరొకవైపు రుద్ర బయట టీ స్టాల్ దగ్గర ఉంటాడు. అక్కడ ఒకతను రుద్రని గుర్తుపట్టి మాట్లాడుతాడు. మీ వల్లే నేను ఇలా ఉన్నాను సర్.. మీరు పోటీలో ఉంటే మాకు చాలా ఆసక్తిగా అనిపించేది.. మిమ్మల్ని ఎవరు బీట్ చెయ్యలేరు సర్ మీ పంచ్ పవరే వేరు అని రుద్ర గురించి అతను చాలా గొప్పగా చెప్తాడు. మరొకవైపు గంగ సెలక్షన్ లో పాల్గొనకుండా పారు ప్లాన్ చేస్తుంది. తనపై కూల్ డ్రింక్ పడేలా చేస్తుంది. దాంతో క్లీన్ చేసుకోవడానికి గంగ వెళ్తుంది. గంగ వెళ్ళగానే పారు బయట నుండి డోర్ పెడుతుంది. గంగ డోర్ తియ్యమని ఎంత అరిచినా ఎవరు డోర్ తియ్యరు. మరొక పక్క సెలక్షన్ కి టైమ్ అయిపోతుంది.
అప్పుడే సెక్యూరిటీ డోర్ తియ్యగా గంగ వచ్చి తన పేరు చెప్తుంది. ఏమైందని అక్కడున్న వాళ్ళు అడుగగా ఎవరో బయట నుండి గడియ పెట్టారని గంగ చెప్తుంది. తన పేరుని గంగ చెప్తుంది. దాంతో మైక్ లో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్ అని చెప్పగానే రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు గంగ, రుద్ర ఇద్దరు సెలక్షన్ ప్రాసెస్ కి వెళ్ళారని శకుంతలకి ఇషిక, వీరు చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



